రాజాం టౌన్ సిఐ గా బాధ్యతలు స్వీకరించిన మోహనరావు* *

రాజాం టౌన్ సిఐ గా బాధ్యతలు స్వీకరించిన మోహనరావు*  *

*రాజాం సిఐ గా పనిచేసి బదిలీపై వెళ్తున కె.రవికుమార్ కు వీడ్కోలు*

*సేవలే గుర్తింపునిస్తాయి డీఎస్పీ శ్రీనివాస్ చక్రవర్తి*

జనం న్యూస్. జనవరి. 22. విజయనగరం జిల్లా. రాజాం.

విజయనగరం జిల్లా రాజాం టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా అనకాపల్లి నుండి బదిలీపై వచ్చిన మోహన్ రావు బాధ్యతలు స్వీకరించారు. రాజాం సీఐ గా పనిచేసి బదిలీపై మన్యం జిల్లా పార్వతీపురం వెళ్తున్న కె.రవికుమార్ కు వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన చీపురుపల్లి డి.ఎస్.పి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ ఉద్యోగి పని చేసిన కాలంలో ప్రజలకు చేసిన సేవలు గుర్తింపునిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తలే రాజేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలు అధిరోహించాలని డాక్టర్ రాజేష్ అన్నారు. బదిలీపై వెళ్తున్న సిఐ కి అధికారులతో పాటు పోలీస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బొబ్బిలి డిఎస్పి శ్రీధర్, రాజాం రూరల్ సీఐ ఎస్. శ్రీనివాసరావు చీపురుపల్లి సిఐ హెచ్.ఉపేంద్ర, వైయస్సార్సీపీ రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, ఎంపీపీ ప్రతినిధి లావేటి రాజగోపాల్ నాయుడు జడ్పిటిసి బండి నరసింహులు సలాది తులసీదాసు మాస్టారు, ఆర్నపల్లి వెంకట నాయుడు మాస్టారు తదితరులు పాల్గొన్నారు...