మహిళ జర్నలిస్టులను ప్రోత్సహించడం ఎంతో అవసరం

మహిళ జర్నలిస్టులను ప్రోత్సహించడం ఎంతో అవసరం

 జనం న్యూస్ 22-01-2024 సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం 

టీ.వై.జె.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు డాక్టర్ తనుగుల జితేందర్ రావు.

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ స్థాయి మహిళా జర్నలిస్టులను ప్రోత్సహించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం అని తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ తణుగుల జితేందర్ రావు అన్నారు. ఆదివారం టి.వై.జే.ఎఫ్ సంగారెడ్డి జిల్లా కమిటీని నియమించిన సందర్భంగా జిల్లా కమిటీలో కార్యవర్గ సభ్యురాలుగా గ్రామీణ జర్నలిస్ట్ సంగీతను నియమించి ఆమెకు నియామక పత్రం అందజేశారు.ప్రస్తుతం మహిళలు జర్నలిజంలో గ్రామీణ స్థాయిలో అరకొరగా ఉన్నారని వాళ్లను ప్రోత్సహించడం ప్రస్తుతం ఎంతో అవసరం అని అన్నారు.మహిళా జర్నలిస్టుల సంక్షేమం కోసం టీ.వై.జె.ఎఫ్ నిరంతర పోరాటం సాగిస్తుందని అన్నారు. ప్రభుత్వంతో చర్చించి గ్రామీణ స్థాయి మహిళా జర్నలిస్టుల కు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫోరం సంగారెడ్డి జిల్లా కమిటీలో తనకు భాగం కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్ రావు గారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా వారితో పాటు టీ.వై.జె.ఎఫ్ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ షేక్ మహబూబ్,టీ.వై.జె.ఎఫ్ రాష్ట్ర కోశాధికారి మఠం మమత,ఆ సంఘం జిల్లా అధ్యక్షులు చల్మెడ అనిల్ కుమార్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.