రామయ్య భజనతో అక్షంతల పంపిణీ*

రామయ్య భజనతో అక్షంతల పంపిణీ*

జనం న్యూస్ జనవరి 15శాయంపేట మండలంలోని నరసింహులపల్లి గ్రామం అయోధ్య రామ మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షింతల వితరణ కార్యక్రమం జరిగింది నరసింహులపల్లి గ్రామ సంయోజక్ టీచర్ వీరన్న అధ్యక్షతన జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు చకిలం రవీందర్ పాల్గొని ఆయన మాట్లాడుతూ అయోధ్య నుండి మన గ్రామానికి అక్షంతలు రావడం చాలా అదృష్టకరమని అన్నారు 500 మంది వేద పండితులతో పూజ చేసిన అక్షంతలు ఈనెల 22న బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ప్రతి ఇంటిలో ఐదు జ్యోతులు వెలిగించినంక ఏ అక్షంతలను ఆశీర్వచనానికి ఉపయోగించుకోగలరని అన్నారు మతాలకతీతంగా ఈ కార్యక్రమం జరగడం ఎంతో అదృష్టకరమని అన్నారు ఈ కార్యక్రమంలో గూడ వాసుదేవ మూర్తి కాజా పాషా. తదితరులు పాల్గొన్నారు