రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక

రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక

 జనం న్యూస్ రాయికల్ ప్రతినిధి జనవరి 22. రాయికల్ మండలం రామారావు పల్లె ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కడకుంట్ల అభయ్ రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక్యేనట్లు జిల్లా సైన్స్ అధికారి బాజోజి శ్రీనివాస్ తెలిపారు.జగిత్యాల లలో ఈనెల 19 నుంచి 21 వరకు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో అభయ్ రాజ్ ఉపాధ్యాయ ప్రదర్శన విభాగం లో ఖర్చు లేని, తక్కువ ఖర్చు తో రూపొదించిన సూపర్ సైన్స్ కిట్ బోధన ఉపకరణాలు ప్రదర్శించి రాష్ట్ర స్థాయి కి ఎంపిక అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అభయ్ రాజ్ ను జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ బి జగన్ మోహన్ రెడ్డి, మండల విద్యాధికారి మూలస్తం గంగాధర్, మండల నోడల్ అధికారి శ్రీపతి రాఘవులు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు కాపు శ్రీనివాస్, పీఆర్ టీయూ జిల్లా అధ్యక్షుడు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ఆనందరావు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పొన్నం రమేష్ మండల అధ్యక్షుడు రాపర్తి నర్సయ్య ప్రధాన కార్యదర్శి తాటిపాముల రమేష్ తదితరులు అభినందించారు.