రుద్రూర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.

రుద్రూర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.

జనం న్యూస్ 29 ఫిబ్రవరి 2024 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా.

రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 లకే గ్యాస్ సిలిండర్ ను ప్రారంభించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నడిపింటి నగేష్, 
ఓబిసి జిల్లా కార్యదర్శి పట్ల సురేష్, ఎంపిటిసి అనిల్ పటేల్, షేక్ గౌస్, కిసాన్ మోర్చ అధ్యక్షులు అడప సాయిలు, ఓబిసి అధ్యక్షులు కర్క అశోక్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ కార్తిక్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మాఖ్డుం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శివశంకర్, నాయకులు అక్బర్ నగర్ ప్రసాద్,సయ్యద్ ముల్తానీ, ఇమ్రాన్ ఖాద్రి,నిసార్, గోపాలరావు రాంబాబు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.