రైతు భరోసా కేంద్రాలు ప్రపంచానికే ఆదర్శం
జనం న్యూస్, నవంబర్ 08
విజయనగరం
రైతు భరోసా కేంద్రాలు రైతులకు సేవ చేయడంలో
ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచాయని జిల్లా పరిషత్
చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం
పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు భరోసా
నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో 1.45 లక్షల మంది
రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.59.72 కోట్లు నిధులు
విడుదల చేశారన్నారు.