అనకాపల్లిలోఘనంగా శ్రీరామ శోభాయాత్ర ప్రారంభం

అనకాపల్లిలోఘనంగా శ్రీరామ శోభాయాత్ర ప్రారంభం

జనం న్యూస్ జనవరి 22 (అనకాపల్లి జిల్లా)

500 సంవత్సరాల కల అయోధ్యలో రామ మందిరంలో బాల రాముడు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని అనకాపల్లి పట్టణంలో చేపల బజారు రామాలయం కామధేను ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేసి శ్రీరామ శోభాయాత్ర పూడిమడక రోడ్డు నుండి బయలుదేరు యాత్రను తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ శాసనమండలి సభ్యులు బుద్ద నాగ జగదీశ్వరరావు ఊరేగింపును ప్రారంభించారు. ముందుగా అర్చకులు రేజేటి చక్రవర్తి బంకుపల్లి సత్తిబాబు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి జైశ్రీరామ్ నినాదాలు శ్రీరామ్ శోభాయాత్ర నెహ్రూ చౌక్ జంక్షన్ మెయిన్ రోడ్ జంక్షన్ వేల్పులి వీధి జంక్షన్ చిన్న నాలుగు రోడ్ల జంక్షన్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాదంశెట్టి చిన్న తల్లి బొలిశెట్టి శ్రీనివాసరావు బొడ్డేడ మురళి ఆళ్ల ప్రవీణ్ కొణతాల రత్నకుమారి అనేకమంది శ్రీరామ భక్తులు పాల్గొన్నారు.//