విజయనగరం ఆర్టీసీ కి సంక్రాంతి ఆదాయం రూ.60,62,477

విజయనగరం ఆర్టీసీ కి సంక్రాంతి ఆదాయం రూ.60,62,477

జనం న్యూస్,జనవరి 29 విజయనగరంఆంద్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజయనగరం జిల్లా పరిదిలో గల విజయనగరం డిపో మరియు ఎస్.కోట డిపోల నుండి 2024వ సంవత్సరం సంక్రాంతి సందర్భముగా జిల్లా కేంద్రము నుండి వివిధ జిల్లా కేంద్రాలకు మరియు గ్రామాలకు అదేవిదముగా హైదరాబాద్ మరియు విజయవాడ, భీమవరం వంటి ప్రధాన నగరాలకు 283 ప్రత్యేక బస్సులను కేవలం సాదారణ చార్జీలతో నడిపి రూ.60,62,477/-లను సంపాదించినట్లు విజయనగరం జిల్లా ప్రజా రవాణా అధికారి .సి.హెచ్. అప్పలనారాయణ నేడు పత్రికా ప్రకటన విడుదల చేశారు . ఈ ఆదాయము సాదించినందుకు రెండు డిపోల డిపో మేనేజర్లకు మరియు సిబ్బందికి ప్రత్యెక అభినందనలు తెలియచేసినారు. అదేవిదముగా శంబర శ్రీ. పోలమాంబ అమ్మవారి జాతరకు జిల్లా నుండి 30బస్సులు నడిపి సుమారు 4లక్షల రూపాయలను సంపాదించినట్లు తెలిపినారు. ఈ ఆదాయము సంపాదించుటకు సహాకరించిన సిబ్బందికి మరియు ప్రయాణీకులకు ధన్యవాదాలు తెలిపారు.