ఇంట్లోవాళ్లు మందలించారని యువతి

ఇంట్లోవాళ్లు మందలించారని యువతి

విజయనగరం మే 17, 2023 గుమ్మలక్ష్మీపురం మండలంలోని తాడికొండ పంచాయితీ వొడ్రుబంగి గిరిజన గ్రామంలో మండంగి సుజాత (19) ఉరిపోసుకొని అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రులు మందలించడంతో మంగళవారం ఉరి వేసుకుని మృతి చెందిందని స్థానికులు చెబుతున్నారు. ఎల్విన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.