సంక్రాంతి ఎఫెక్ట్.. అసాంఘీక చర్యలకు పాల్పడుతున్న వ్యక్తుల అరెస్ట్
జనం న్యూస్,జనవరి 20
విజయనగరంఐదు
సంక్రాంతి పండుగను ప్రశాంతంగా నిర్వహించేలా
తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని పోలీసులు
తెలిపారు. పేకాట శిబిరాలపై దాడులు చేసి 239
మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.8,59,931
నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందేలు
ఆడుతున్న59 మందిని అదుపులోకి తీసుకున్నారు.
చాలా చోట్ల సారా బట్టీలను, బెల్లం ఊటలను ధ్వంసం
చేశారు. ఇప్పటి వరకు డ్రంక్ డ్రైవ్లో 130మంది
పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు.