గెలుపే లక్ష్యంగా'బుడ్డా' ఎన్నికల ప్రచారం... *

గెలుపే లక్ష్యంగా'బుడ్డా' ఎన్నికల ప్రచారం...  *

 జనం న్యూస్ 10 మే 2024 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా : మండలంలోని సంత జూటూరు, బండి ఆత్మకూర్ గ్రామాలలో చివరి రోజున మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సూపర్ సిక్స్ పథకాలతో గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ముందుగా గ్రామాల్లోకి మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వెళ్ళగానే గజమాల, పూలమాలలతో మంగళహారతులతో గ్రామంలోకి ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేబుడ్డా మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేయాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని ప్రచారంతో హోరెత్తించారు. సీఎం జగన్ ఐదేళ్ల పరిపాలనతో ప్రజలు బాగా ఇసుకు చెంది స్వచ్ఛందంగా తెలుగుదేశంలో చేరుతున్నారని  మాజీ ఎమ్మెల్యే బుడ్డా అన్నారు. రాక్షస పాలనను అంతముందేంచేందుకు ఎన్నికల్లో ఐక్యంగా కష్టపడాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలన్న, ప్రజలు ప్రశాంతంగా జీవించాలన్న టిడిపిని గెలిపించాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామల్లోని సమస్యలను  పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రేపు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు మీ బలమైన ఓటు వేసి ఆశీర్వదించి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల ఇన్చార్జి నందిపాటి నరసింహారెడ్డి,కంచర్ల సురేష్ రెడ్డి, కంచర్ల మనోహర్ రెడ్డి, మల్లేశ్వర్ రెడ్డి, కంచర్ల లింగారెడ్డి, తాటికొండ బుగ్గరాముడు,పలుచాని మహేశ్వర్ రెడ్డి,నాగేంద్ర రెడ్డి, కృష్ణారెడ్డి,పక్కిరెడ్డి,సర్పంచ్ రామచంద్రుడు,చాంద్ భాష, తిరుపాలు,తులసమ్మ,బాబు రెడ్డి,మోక్షేశ్వర్ రెడ్డి, కృష్ణారెడ్డి,డిసు రామలింగం, కృష్ణ నాయక్,మద్దిగారి మదన భూపాల్, వెంగల్ రెడ్డిపేట శ్రీనివాసులు,జాకీర్ ఖాన్,పాల సుబ్బారెడ్డి, మధు, కూటమి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.