సైబర్ నేరాలపై అవగాహన..!.

సైబర్ నేరాలపై అవగాహన..!.

జనం న్యూస్ 04 మే 2024  జోగులాంబ గద్వాల: సాంకేతిక పరిజ్ఞానం తో కొత్త కొత్త మార్గాలలో జరుగుతున్న  సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్త గా ఉండాలని, డబ్బులు పోయాక బాధపడటం కంటే ముందే జాగ్రత్తగా ఉండటం మంచిదని గద్వాల్ రూరల్ ఎస్సై పర్వతాలు అన్నారు.జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్  ఆదేశాల ఈ రోజు గద్వాల్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సైబర్ నేరాలు జరుగుతున్న తీరు, ప్రజలు వాటికీ గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ..  కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానం తో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా  ఉండాలని ,  డబ్బుల పోయాక బాధపడటం కంటే అవగాహనా తో వ్యవహరించి జాగ్రత్త గా ఉండాలని అన్నారు. 
ముఖ్యంగా బ్యాంక్ అదికారులు ఎవరు కూడా ఫోన్ చేసి OTP వివరాలు అడగరు అనే విషయాలను గుర్తించాలని ,బ్యాంక్ వారు ఏలాంటి మెసేజ్ లు గాని, లింక్స్ పంపరని గ్రహించాలని, ఏమైన సందేహాలు ఉంటే బ్యాంక్ కు వెళ్లి నిర్ధారించుకోవాలి అని అన్నారు. అలాగే పెండింగ్ బిల్లుల కోసం ఏదైనా ప్రభుత్వ శాఖ వారు ఫోన్ చేసి OTP వివరాలు అడుగరనే విషయన్ని గ్రహించాలని అన్నారు. 
ప్రజలు ,గ్రూప్ లలో లేదా వ్యక్తిగత నెంబర్ లకు అపరిచిత వ్యక్తుల నుండి sms, emails ద్వారా గాని,whatsap,twitter ద్వారా వచ్చే blue కలర్ లింక్స్ ను క్లిక్ చేసి మోసపోవద్దని, అలా వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దు, చిన్న చిన్న తప్పిదాలతో తాము కష్ట పడి సంపాదించిన  డబ్బును పోగొట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో  IPL క్రికెట్  సందర్భంగా యువత IPL డ్రీమ్ లేవెన్ అప్లికేషన్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టీ రెండు టీమ్ లలో బెస్ట్ ఒక టీమ్ను సెలెక్ట్ చేసుకుంటారని వారు ఆడే ర్యాంకు ను బట్టీ తద్వారా పెట్టిన అమౌంట్ కు అదనంగా డబ్బుల వస్తుoటాయాని  ఆ క్రమం లో  సైబర్ నేరగాళ్లు అప్లికేషన్ లు పంపించి మేము మంచి టీం ను సెలక్ట్ చేస్తాము అని చెప్పి మన యూజర్ ఐడీ అడుగుతారని  అవి మనం ఆశకు పోయి ఇచ్చినట్లు అయితే  పలితంగా మన డేటా వాళ్ళకు వెళ్లిపోవడం  డబ్బులు కోల్పోవడం జరుగుతుందని , మరో విధంగా FEDEX కొరియర్ పేరుతో మన ఫోన్ లకు కాల్ చేసి పోలీసులము అంటూ మీరు పెట్టిన ఆర్దర్ లో డ్రగ్స్ వచ్చాయని కావున మిమ్ములను అరెస్ట్ చేస్తామని లేడంటే డబ్బులు వేయాలని బెదిరిస్తారని ఎవరూ భయపడి డబ్బులు వేయవద్దు అనీ, వెంటనే  లోకల్ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఆన్లైన్ లో తక్కువ రేటుకు విలువైన వస్తువులు వస్తాయంటే నమ్మి సైబర్ నేరాలకు గురి కావద్దని,అలాగే మిసో లో ఆన్లైన్ షాపింగ్ చేయడం వల్ల మీకు కొన్ని లక్షల లాటరీ తాకిందని అవి పంపడానికి కొత్త రిజిస్టర్ ఫీ అంటూ సైబర్ మోసగాళ్ళు మోసం చేసే ప్రయత్నం చేస్తారని అట్టి వాటి పై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైన  వెంటనే స్పందించి 1930 కి సమాచారం అందించి NCRP portal (www.cybercrime.gov.inలో ఫిర్యాదు చెయ్యాలని లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే సైబర్ వారియర్స్  పోలీస్ ఉన్నతాధికారుల  దృష్టికి తీసుకెళ్లి సైబర్ నేరగాళ్ల బ్యాంకు అకౌంట్ల ను ఫ్రీజింగ్ లో ఉంచడం జరుగుతుంది తరవాత కోర్టు ల అనుమతి ద్వారా ప్రాసెస్ చేసి బాధితులకు డబ్బులు తిరిగి ఇవ్వడం జరుగుతుందని, జిల్లా లో  ఇప్పటి వరకు 36 వేల రూపాయలను రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందని అన్నారు.అనంతరం గంజాయి, కల్తీ కల్లు, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనర్థాలను తెలియజేసే, దానికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ లను తెలియజేసే పోస్టర్ లను విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.