పైడిమాంబ ఆలయానికి సంక్రాంతి శోభ

పైడిమాంబ ఆలయానికి సంక్రాంతి శోభ

జనం న్యూస్,జనవరి 14 

విజయనగరంఐదు

సంక్రాంతి పండగ నేపథ్యంలో విజయనగరం ప్రజల

ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని

సుందరంగా అలంకరించారు. విజయనగరంలోని

మూడు లాంతర్ల కూడలి వద్దనున్న అమ్మవారి

చదురుగుడి ఆలయాన్ని వివిధ రకాల పూలతో

ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతుల వెలుగులతో

ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. పండగ

నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని

దర్శించుకుంటున్నారు.