అయోధ్య శ్రీరామ అక్షింతలు దేవిరాజు స్వామి ఆధ్వర్యంలో పంపిణీ

అయోధ్య శ్రీరామ అక్షింతలు దేవిరాజు స్వామి ఆధ్వర్యంలో పంపిణీ

జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట పండగలాజరుపుకుందాం

జనం న్యూస్ జనవరి 11 గోరంట్ల శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గుమ్మయిగారిపల్లిలో వెలిసిన శ్రీ మారేమ దేవి ట్రస్ట్ చైర్మన్ దేవి రాజ స్వామి ఆధ్వర్యంలో గోరంట్ల మండలం కమ్మవారి పల్లి పంచాయతీ మరియు గోరంట్ల పటంలోని బీసీ రెడ్డి కాలనీలో అయోధ్య శ్రీరామ అక్షింతలు పంపిణీ చేశారు

 అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జనవరి 22 న బాల రాముని ప్రాణప్రతిష్ట జరగబోతన్న సందర్బంగా శ్రీరామ పూజిత అక్షింతలు అయోధ్య నుండి బయలుదేరి రాష్ట్రాలకు, జిల్లాలకు, ఇప్పుడు మండలాలకు చేరాయి, మనకు కూడా వచ్చాయి, వీటిని స్పర్శ చేసి వృద్ధి చేసి పంచాయతీ, మరియు వార్డు వారిగా అందచేయడoలో భాగంగా గోరంట్ల ఖండ కమ్మవారి పల్లి పంచాయతీ ఎస్సీ కాలనీలో గురువారం అక్షింతలు వితరణ కార్యక్రమం జరిగింది.ఈకార్యక్రమంలో ఎస్ ఎస్ ఎఫ్ జోన్ ధర్మ ప్రచారక్ చౌడూరు ఈశ్వర్ రెడ్డి , జిల్లా ధర్మప్రచారక్ సుధాకర్ బూర్గుల, గ్రామ వికాస్ జిల్లా ఇన్చార్జి దేవరాజ్ స్వామి, నిధి ప్రముఖ, రామ్మోహన్ , కండ ధర్మపరిచారు లక్ష్మీనారాయణ , వెంకటరాముడు మరియు భజన బృందములు పాల్గొన్నారు. జనవరి 22న అయోధ్యలోజరుగు రామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, ఉదయం పూజా భజన, మధ్యాహ్నం టీవీలో లైవ్, కార్యక్రమాలు ఉంటాయి ప్రజలు వీక్షించండి సాయంత్రం 5 దీపాలు వెలిగించాలి.