అయోధ్య శ్రీరాముల వారి అక్షంతలు వితరణ కార్యక్రమం

అయోధ్య శ్రీరాముల వారి అక్షంతలు వితరణ కార్యక్రమం

 జనం న్యూస్ జనవరి 10, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని పద్మావతి కాలనీలో రామ జన్మభూమి ట్రస్ట్, అయోధ్య శ్రీరాములవారి అక్షంతల వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిగి బాలాజీ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పూజారి ఆధ్వర్యంలో, పరిగి మండల మహిళ అధ్యక్షురాలు కావలి లక్ష్మి సమక్షంలో, ఇంటింటికి వెళ్లి శ్రీ రాములవారి అక్షంతల వితరణ కార్యక్రమం చేపట్టినారు. 22వ తారీకు అయోధ్యలో శ్రీరాములవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది. ఆరోజు ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి శ్రీరామ జయరామ జయ జయ రామ అని నామస్మరణ చేయాలని అన్నారు. కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.