ఆ గ్రామంలో ప్రజలు భోగి జరుపుకోరు
జనం న్యూస్,జనవరి 15
విజయనగరంఐదు
కొమరాడ మండలం కల్లికోట గ్రామంలో ప్రజలు భోగి
పండగను జరుపుకోరు. కొన్ని సంవత్సరాల క్రితం భోగి
రోజున మంటల నుంచి వచ్చిన అగ్గి రవ్వలు ఎద్దుల
కంట్లో పడి కళ్ళకు తీవ్ర గాయాలై 2 ఎద్దులు భోగి
మంటల్లో పడి మరణించినట్లు పూర్వీకులు చెప్పారని
సర్పంచ్ తెలిపారు. అప్పటి నుంచి భోగి పండగను
గ్రామంలో జరుపుకోమన్నారు. సంక్రాంతి, కనుమ
పండగలు జరుపుకుంటామన్నారు.