ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
జనం న్యూస్,జనవరి 19
విజయనగరంఐదు
పేదల అభ్యున్నతికి కృషి చేసిన స్వర్గీయ నందమూరి
తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి
చేయాలని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా
కార్పొరేషన్ కార్యాలయం వద్ద వున్న ఎన్టీఆర్ విగ్రహానికి
పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నిరాశ్రయులైన పేదలకు, వృద్ధులకు పండ్లు,
బిస్కెట్లు, స్వీట్లు పంపిణీ చేశారు.