ఘనంగా స్వామి వివేకానంద జయంతి

ఘనంగా స్వామి వివేకానంద జయంతి

 జనం న్యూస్ ప్రతినిధి ఉరుమడ్ల సంజీవ్ రాయికల్ పట్టణం జనవరి12.

రాయికల్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి జరపడం జరిగింది ఈ సందర్భంగా రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం ఆధ్యాత్మిక విలువలను చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద ఆయన బోధనలు ఎప్పుడూ యువతకు స్ఫూర్తినిస్తాయి. ఆయన ప్రసంగాలు యువకుల్లో చైతన్యం నింపుతాయి.

అందుకే ఆయన జయంతి రోజైన జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం లేదా నేషనల్ యూత్ డే నిర్వహించాలని 1984లో భారత ప్రభుత్వం నిర్ణయించింది.

1985 నుంచి ఏటా వివేకానందుడి ఆదర్శాలు కొనసాగేలా యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం.

ఈ రోజును యువ దివస్ అని కూడా పిలుస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు 

ఈ కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షులు కొమ్ముల ఆది రెడ్డి, జెడ్ సి కాటిపెల్లి రామ్ రెడ్డి, డిసి బత్తిని భూమయ్య, కోశాధికారి గంట్యాల ప్రవీణ్, లయన్స్ సభ్యులు ఎద్దండి దివాకర్, కొత్తపెల్లి రంజిత్, వాసం ప్రసాద్ పాల్గొన్నారు.