వ్యూహం చిత్రంపై నేడు హైకోర్టులో వాదనలు*

వ్యూహం చిత్రంపై నేడు హైకోర్టులో వాదనలు*

. జనం న్యూస్ 12 జనవరి 2024 

హైదరాబాద్: --- 

చర్చనీయ వంశంగా రూపొందిన వ్యూహం చిత్రంపై తెలంగాణ హైకోర్టులో సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే హైకోర్టులో ఇరువైపుల వాదనలు పూర్తి అయ్యాయి.శుక్రవారం మధ్యాహ్నం తీర్పు ప్రకటించనుంది. ఒకవేళ ఈరోజు తీర్పు వెలువరించకపొతే ఈ నెల 22న ప్రకటిస్తామని న్యాయ స్థానం పేర్కొంది.

కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కించ పరిచేలా సన్నివేశాలు ఉన్నాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

దీంతో సినిమా విడుదలను హైకోర్టు నిలిపివేసింది. సినిమా విడుదల ఆగి పోవడం వల్ల కోట్ల రూపా యల నష్టం వాటిల్లితుందని చిత్ర యూనిట్ వాదిస్తోంది. సినిమాకు సంబంధం లేని వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది.

ఈనెల 11 వరకు వ్యూహం సినిమా విడుదల నిలిపి వేస్తూ కొద్ది రోజుల క్రితం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

*జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా*