జీతాలు చెల్లించకపోతే పంపింగ్ నిలిపేస్తాం'
జనం న్యూస్,జనవరి 13
విజయనగరంఐదు
ముసిడిపల్లి, నెల్లిమర్ల, సారిపల్లి మాస్టర్ పంప్
హౌస్ కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలని
ఏపీ మున్సిపల్ వర్కర్స్&ఎంప్లాయిస్ ఫెడరేషన్
(సిఐటియు) ఆధ్వర్యంలో శుక్రవారం విజయనగరం
నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా
నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్
నాయకులు జగన్ మాట్లాడుతూ.. పండగ పూట జీతాలు
చెల్లించకుండా కార్మికులను పస్తులు ఉంచడం భావ్యం
కాదన్నారు. జీతాలు చెల్లించకపోతే పంపింగ్ నిలుపుదల
చేస్తామని చెప్పారు.