పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆప్
జనం న్యూస్, నవంబర్ 06
విజయనగరం
రెండు రోజుల పాటు పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న
ఎన్నికల ప్రత్యేక కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా
కన్వీనర్ కె. దయానంద్ ఆదివారం పరిశీలించారు. ప్రతీ
ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు పరిశీలన చేసుకోవాలని
కోరారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లకు ఇంటింటి
సర్వే తరువాత కూడా కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు
పోలింగ్ బూతుల్లో ఉన్నట్లు తమకు తెలియజేసారని
దీనిపై అధికారులు పరిశీలన జరిపి సరిచేయాలన్నారు.