బిజెపితో భారత్ కు ప్రపంచస్థాయి -ఏపీలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పని చేయాలి

బిజెపితో భారత్ కు ప్రపంచస్థాయి -ఏపీలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పని చేయాలి

జనం న్యూస్ జనవరి 24 (అనకాపల్లి జిల్లా)ప్రపంచంలో భారతదేశాన్ని గర్వించేలా కృషిచేసిన ప్రధానమంత్రి మోడీ ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర మంత్రి మురళీధరన్ పిలుపునిచ్చారు. అనకాపల్లి లో విజయ రెసిడెన్సిలో  శక్తి కేంద్రాల ప్రముఖులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మళ్ళీ రానున్నది బిజెపి ప్రభుత్వమే అని చెప్పారు. ప్రతి ఒక్కరు తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో పార్టీని అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటిలో  ఓటర్ ని చైతన్యపరచాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ మాధవ్, బిజెపి ప్రధాన కార్యదర్శి కాశీ రాజు, జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు, రాష్ట్ర నాయకులు డాక్టర్ సత్యనారాయణ, కార్యదర్శులు వర్మ, పట్టాభి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.//