భోగిమంటల్లో ప్రభుత్వ జీవో కాపీలు
జనం న్యూస్,జనవరి 15
విజయనగరంఐదు
వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజా వ్యతిరేక జీవో
కాపీలను భోగి మంటల్లో వేసి కాల్చివేసినట్లు టీడీపీ
నియోజకవర్గ ఇంచార్జి పూసపాటి అదితి గజపతి రాజు,
జనసేన నేత పాలవలస యశస్విని తెలిపారు. టీడీపీ
జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల
మేరకు భోగి రోజున పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో
ఏర్పాటు చేసిన భోగిమంటల్లో పలు జీవో కాపీలను దగ్ధం
చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.