మెదరమెట్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం... ఒక వ్యక్తి మృతి

మెదరమెట్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం... ఒక వ్యక్తి మృతి

 జనం న్యూస్ ( జనవరి 12 )( బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం 

 కొరిసపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు వైపు వెళుతున్న ద్విచక్ర వాహనం మెదరమెట్ల జాతీయ రహదారి వద్ద అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఇంకొల్లు మండలం పావులూరు గ్రామానికి చెందిన గుంజి వీరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై నాగ శివారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.