విజయ దుర్గ యూత్ సోసైటీ కి స్వామి వివేకానంద అవార్డు

విజయ దుర్గ యూత్ సోసైటీ కి స్వామి వివేకానంద అవార్డు

జనం న్యూస్,జనవరి 11 విజయనగరంఐదు

2024 జాతీయ యువజన ఉత్సవం సందర్భంగా అత్యధికంగా బ్లడ్ డొనేషన్ చేసిన వారికి, అత్యధికంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేసిన చేసిన మోటివేటర్స్ కి విజియ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ పుణ్యమంతుల శివ గారు స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ శ్రీరామ్ మూర్తి గారి చేతుల మీదుగా తమవంతు కృషి చేస్తున్న యువతి యువతలకు సన్మాన కార్యక్రమం చేశారు. విజయ దుర్గ యూత్ సొసైటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కేశవపట్నం చంద్రిక అత్యధికంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడమే కాకుండా తాను కూడా ఎనిమిది సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం గొప్ప విషయం అని డాక్టర్ శ్రీరామమూర్తి గారు కొనియాడారు.... యువత మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. స్వామి వివేకానంద గారి అడుగుజాడల్లో యువత నడుచుకోవాలని సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. విజయ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ శివ పుణ్యమంతుల మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో ఆడవాళ్లు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడం అరుదుగా ఉంటారని. విజయ దుర్గ యూత్ సొసైటీ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ కేశవపట్నం చంద్రిక చందు గారు అనేక బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా విజయ దుర్గ యూత్ సొసైటీ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ కేశవపట్నం చంద్రిక చందు మాట్లాడుతూ డాక్టర్ శ్రీరామ్ మూర్తి గారు చేతులపై ఈ సన్మానం జరగడం ఆనందంగా ఉంది అన్నారు. విజయ బ్లడ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ శివ పుణ్యమంతుల ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇంకా రానున్న రోజుల్లో విజయనగర పట్టణ ప్రజలకు మంచి మంచి సేవ కార్యక్రమాలు చేస్తూ విజయ దుర్గ యూత్ సొసైటీ ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని ఆమె తెలిపారు.