శ్రీ రాముల వారి అక్షంతల వితరణ కార్యక్రమం*

శ్రీ రాముల వారి  అక్షంతల వితరణ కార్యక్రమం*

 జనం న్యూస్ జనవరి 8 శాయంపేట మండలం లో అయోధ్య రామ మందిర తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాయంపేట మండల కేంద్రంలో మరియు ఆరోపల్లె గ్రామంలో అక్షంతల వితరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి శాయంపేట మండల సంయోజక్ గిద్దమారి సురేష్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ కిసాన్ సాంగ్ జిల్లా అధ్యక్షులు లెక్కల జలంధర్ రెడ్డి లక్ష్మి శ్రీరాముని తీర్థ ట్రస్టు వరంగల్ జిల్లా సాహసంయోజక్ ఆర్ ఎల్ కె ప్రసాద్ పాల్గొని 500 మంది వేద పండితుల పూజ చేసి పంపిన అక్షంతలు వితరణ కార్యక్రమం శాయంపేట మండల కేంద్రంలో జరిగింది జైశ్రీరామ్ జయ రామ శ్రీరామ జయ జయ రామ అనే సంకీర్తనలతో భజనలతో శాయంపేట వాడ వాడల సంకీర్తనలు మారుమోగింది అంతేగాక ఈనెల 22వ తారీఖున అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం గురించి ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాయంపేట ఆలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు ఆలయ కమిటీ చైర్మన్ సామల బిక్షపతి గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ వల్పదాస్ చంద్రమౌళి గ్రామ సంయోజక్ కడారి చంద్రమౌళి సాహసంయోజక్ కానుగుల నాగరాజు బాసాని విద్యాసాగర్ వనం దేవరాజ్ బాసాని నవిన్ నామని శివ ఉప్పు రాజు మోరి రంజిత్ వడ్డేపల్లి శ్రీనివాస్ కుమారస్వామి కందగట్ల వెంకన్న మామిడి భరత్ రాకేష్ పాడి సమ్మిరెడ్డి దుంపల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.....