సతకం పట్టు జీవీఎంసీ స్కూల్ పోలింగ్ బూత్ నందు ఈవీఎం మిషన్ అవగాహన కార్యక్రమం: బొడ్డేడ మురళి

సతకం పట్టు జీవీఎంసీ స్కూల్ పోలింగ్ బూత్ నందు ఈవీఎం మిషన్ అవగాహన కార్యక్రమం: బొడ్డేడ మురళి

జనం న్యూస్ జనవరి 19 (అనకాపల్లి జిల్లా)229-230 వార్డులో సతకంపట్టు స్కూల్ ఆవరణలో బూత్ నెంబర్ 229,230 ఈవీఎం డెమో తనిఖీలను రెవెన్యూ అధికారులు రాజకీయ పార్టీల సమక్షంలో ఏ విధంగా పనిచేస్తున్నాయో బి ఎల్ వో చేసి చూపించారని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా తెలుగు అధికార ప్రతినిధి బొడ్డేడ మురళి తెలిపారు. ఈవీఎం లలో ఏ పార్టీకి ఏ సింబల్ నొక్కితే దాని ప్రకారంగా అక్కడ ఓటు పడుతుందో లేదో డెమోలో చూపించారని తీసుకువచ్చిన ఈవీఎంలు సక్రమంగానే పని చేశాయని మురళి అన్నారు.ఈ కార్యక్రమంలో బూత్ ఏజెంట్ ఆడారి జగన్నాథరావు పెంటకోట వెంకటరమణ బుద్ధ లక్ష్మీ అప్పారావు సూరిశెట్టి నూక శివ అప్పారావు బుద్ధ కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.