సీఎం జగన్మోహన్ రెడ్డికి శాపనార్థాలు పెట్టిన అంగన్వాడీలు
జనం న్యూస్,జనవరి 21 విజయనగరంఐదు
39 రోజులుగా సమ్మె చేస్తున్న తమ సమస్య
పరిష్కరించలేదంటూ కొత్తవలసలో అంగన్వాడీలు
సీఎం జగన్మోహన్ రెడ్డికి శాపనార్థాలు పెట్టారు. సీఎం
చిత్రపటానికి కళ్లకు గంతలు కట్టి ఫోటోకు దండేసి తమ
బతుకులు భారం అయ్యాయని, ఏపీకి కళ్ళు, చెవులు,
నోరు లేవంటూ ప్లకార్డ్లు పెట్టారు. తాము ఓటర్లలో
ఒక భాగమే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమని
నినాదాలు చేశారు.