ఉత్తరాంధ్ర నుంచే సిఎం ఎన్నికల శంఖారావం
జనం న్యూస్,జనవరి 22
విజయనగరం
ఉత్తరాంధ్ర నుంచే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల
శంఖారావం పూరించనున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి
శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ జిల్లా భీమిలి మండలం
తగరపువలసలో సిఎం క్యాడర్ సమావేశానికి సభా స్థలాన్ని
వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డితో
కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ ఈనెల 27న నిర్వహించనున్న
సిఎం క్యాడర్ సమావేశాన్ని విజయవంతం చేయాలని
కోరారు.