స్పందన" ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం*
*- విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్*
జనం న్యూస్,జనవరి 23
విజయనగరం
విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు
“స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం. దీపిక గారు జనవరి 22, సోమవారం నాడు నిర్వహించారు. ప్రజల
నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో
కాన్ఫరెన్సులో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని
అధికారులను ఆదేశించారు. "స్పందన" కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీగారు 33 ఫిర్యాదులను స్వీకరించి, వాటి
పరిష్కారానికి చర్యలు చేపట్టారు.