75 వ గణతంత్ర పరేడ్ కు ప్రత్యేక అతిథిగా .నందెపు వెంకటేశ్వర రావు

75 వ గణతంత్ర పరేడ్ కు ప్రత్యేక అతిథిగా .నందెపు వెంకటేశ్వర రావు

జనం న్యూస్ జనవరి 25 కాట్రేనికొన 75 వ గణతంత్ర పరేడ్ కు ప్రత్యేక అతిథిగా భారత ప్రభుత్వం  మెట్రోకెమ్ అధినేత డా.నందెపు వెంకటేశ్వర రావును ఆహ్వానించడం హర్షణీయమని తిరుమల తిరుపతి దేవస్థానం,శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహా దారుడు అడపా దుర్గ అన్నారు ,సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలు అధిరోహించి వందలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న నందెపు వేంకటేశ్వర రావు అరుదైన గౌరవానికి అర్హులని ఆయన అన్నారు,నందెపు కుటుంబానికి దక్కిన గౌరవం కోనసీమ వాసులకు గర్వకారణమని దుర్గ పేర్కోన్నారు ఈ సందర్భంగా నందెపు వెంకటేశ్వర రావును అభినందించారు, దేశ పురోగతికి పాటుపడుతున్న ఇటువంటి వారని గౌరవించడంపై కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు .