టిడిపి వీడి వైసీపీలో చేరిన 200 కుటుంబాలు

టిడిపి వీడి వైసీపీలో చేరిన 200 కుటుంబాలు

 జనం న్యూస్( జనవరి 13)( బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం)

 సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు కోటేశ్వరరావు, నాగరాజు, అంకమ్మల ఆధ్వర్యంలో 200 కుటుంబాలు శనివారం సాయంత్రం స్థానిక వైయస్సార్ పార్టీ కార్యాలయం నందు అద్దంకి వైయస్సార్ పార్టీ ఇంచార్జ్ హనీమిరెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా హనీమిరెడ్డి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. వైయస్సార్ పార్టీ గెలుపుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని హనిమిరెడ్డి వారికి సూచించారు.