టీడీపీతోనే బీసీలకు న్యాయం

టీడీపీతోనే బీసీలకు న్యాయం

* వైసీపీ హయాంలో అణిచివేత
* మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణి
జనం న్యూస్,ఫిబ్రవరి 04 విజయనగరంతెలుగుదేశం పార్టీ హయాంలోనే బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని టీడీపి పొలిట్ బ్యూరో సభ్యురాలు మరియు శాసన మండలి మాజీ సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శనివారం మెంటాడలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలు అణచివేతకు గురయ్యారని విమర్శించారు. ఆ వర్గాన్ని జగన్ రెడ్డి ఓటు బ్యాంకు గానే చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు విధులు లేకుండా ఉత్సవ విగ్రహాల్లా మార్చారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో మళ్లీ కపట ప్రేమ నటిస్తూ మరోసారి మోసం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని, బీసీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీడీపీ బీసీలను వెన్నెముక గా భావిస్తుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం బీసీల వెన్నెముఖను విరిచిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీసీలతో పాటు అన్ని వర్గాలు వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మరోసారి తీరని అన్యాయానికి గురవుతామని చెప్పారు. బీసీలంతా సంఘటితంగా ఉండాలని సూచించారు. రానున్నది టీడీపీ, జనసేన ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. వైసీపీకి ఈ ఎన్నికల్లో అభ్యర్థులు కరువై ఆపసోపాలు పడుతూ ఎమ్మెల్యేలు, ఎంపీలను బదిలీ చేస్తున్నారని ఎద్దేవాచేశారు. జగన్ రెడ్డి ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా ఓటమి తప్పదని సంధ్యారాణి అన్నారు. కార్యక్రమంలో టిడిపి శ్రేణులు చలుమూరి వెంకటరావు,జి. అన్నవరం,రెడ్డి ఆదినారాయణ,రెడ్డి ఎర్నాయుడు, అర్ రవిశంకర్,అర్ సత్యనారాయణ,రామ చంద్రుడు,చిన్నం నాయుడు,తదితరులు పాల్గొన్నారు