ట్రాక్టర్ నుంచి జారిపడి వ్యక్తి మృతి
జనం న్యూస్,జనవరి 11
విజయనగరంఐదు
ట్రాక్టర్పై నుంచి జారిపడి వ్యక్తి మృతిచెందిన ఘటన
విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల
వివరాల ప్రకారం బాడంగి మండలానికి చెందిన చొక్కాపు
వాసు(30) వారం రోజులుగా ఉత్తరావల్లిలో ట్రాక్టర్తో
పొలం పనులు చేస్తున్నాడు. మంగళవారం స్వగ్రామానికి
వెళుతుండగా సంతతోట సమీపంలో ప్రమాదవశాత్తూ
ట్రాక్టర్పై నుంచి జారిపడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర
గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు
కేసు నమోదు చేసుకున్నారు.