తెలుగుదేశం పార్టీలో పలు గిరిజన కుటుంబాలు.

తెలుగుదేశం పార్టీలో పలు గిరిజన కుటుంబాలు.

 జనం న్యూస్ 25 మార్చి 2024 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా: మండల పరిధిలోని జి. సి. పాలెం మజరా గ్రామమైన నెమళ్లకుంట  గిరిజన తండాలో గిరిజనులు ఉత్తలూరి నందలయ్య, నాగలూటి భూమని ఈదన్న, ఉత్తలూరి ఈదన్న, భూమని బయన్న, గుల్ల ఈదన్న, రాగి నారాయణ, ఉత్త పాయి, ఈదలమ్మలతోపాటు 15 కుటుంబాలు వైసీపీని వీడి   టిడిపిలోకి చేరారు..వీరికి తెలుగుదేశం పార్టీ శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి,, ఉప సర్పంచ్ కంచర్ల లింగారెడ్డి, శ్రీనివాసులు ఆధ్వర్యంలో వీరికి    తెలుగుదేశం పార్టీ కండువాలను కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు.. చిన్న పెద్ద వయసుతో తారతమ్యం లేకుండా గిరిజనలందరూ ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు.కండువాలు కప్పుకొని తెలుగుదేశం పార్టీపై అభిమానాన్ని చాటుకున్నారు.   ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.