పసుపు ఆకు నుంచి నూనె తయారి చేసే యంత్రం భూమి పూజ*

పసుపు ఆకు నుంచి నూనె తయారి చేసే యంత్రం భూమి పూజ*

  జనం న్యూస్ జనవరి 13: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని గుమ్మిర్యాల్ గ్రామము లో ఐసీఐసీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రోజునా పసుపు ఆకు నుంచి నూనె తయారి యూనిట్ ను మణికంఠ మహిళా గ్రూప్ సంఘం సభ్యుల కు ఇవ్వడం జరిగింది. ఈ యంత్రం యూనిట్ ఖర్చు సుమారు 15,00,000 రూపాయలు కాగా ఇందులో మహిళా సంఘము గ్రూప్ వాటా 2,50,000 రూపాయలు కాగా మిగతా12,50,000 రూపాయలు ఐసీఐసీఐ ఫౌండేషన్ వారి ఆర్థిక చేయూత వారిది, వారి అధ్వర్యంలోనే భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ రాజారెడ్డి గ్రూప్ అధ్యక్షురాలు సాయమ్మ ,రాజవ్వ, లక్ష్మి, సోమ లక్ష్మి, యమున, రాధ లక్ష్మి, పద్మ, రాజక్క మరియు ఐసీఐసి ఫౌండేషన్ ప్రతినిధులు అభివృద్ధి అధికారి భూక్యా రాజేష్, బక్కి అఖిల, సి యాప్, ఎస్ చెవులమద్ది రాజేష్,మధు,చింత శ్రీనివాస్,సాయి తదితరులు పాల్గొన్నారు.