పార్టీ ఆదేశిస్తే విశాఖలో పోటీ చేస్తా: బొత్స ఝాన్సీ
జనం న్యూస్,జనవరి 11
విజయనగరంఐదు
విశాఖ ఎంపీ బరిలో తన పేరు తెరపైకి రావడంతో ఈ
విషయంపై బొత్స ఝాన్సీ స్పష్టత ఇచ్చారు. విశాఖ
స్థానికురాలిగా, బీసీ మహిళగా ఎంపీగా పోటీ చేసే
హక్కు తనకుందని ఆమె అన్నారు. బీసీలను సీఎం
జగన్ ప్రోత్సహిస్తున్నారని, అధిష్ఠానం ఆదేశిస్తే ఎంపీగా
పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. జగన్ మాటను
శిరసావహిస్తానని ఝాన్సీలక్ష్మి తెలిపారు.