ప్రభుత్వం పిట్టకథలు చెబుతూ గడిపేసింది: అశోక్ గజపతిరాజు

ప్రభుత్వం పిట్టకథలు చెబుతూ గడిపేసింది: అశోక్ గజపతిరాజు

జనం న్యూస్,జనవరి 09 

విజయనగరంఐదు

నాలుగున్నరేళ్లు వైసీపీ ప్రభుత్వం పిట్టకథలు చెబుతూ

గడిపేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్

గజపతిరాజు విమర్శించారు. అమరావతిలో ప్రజావేదిక,

విజయనగరంలో సౌర విద్యుత్తు ప్లాంట్ల ధ్వంసంతో జగన్

అరాచక పాలన మొదలై నేటికీ కొనసాగుతుందన్నారు.

మద్యం అమ్మకాలు, గంజాయి రవాణా, అత్యాచారాలు,

నిరుద్యోగంలో రాష్ట్రం ముందుందని ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.