వినుకొండలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

వినుకొండలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

వినుకొండలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు.. 

- వేడుకల్లో పాల్గొన్న పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

 జనం న్యూస్.. జనవరి23.. వినుకొండ..

 వినుకొండ..టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు వినుకొండలో నియోజకవర్గ తెలుగు యువత బొదేపుడి శంకర్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించగా పలనాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం వినుకొండ మండలం విఠంరాజుపల్లి బదిరుల పాఠశాలలో విద్యార్థులకు లోకేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి భోజన వసతి కల్పించి జీవి ఆంజనేయులు చేతుల మీదగా భోజనాన్ని వడ్డించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు గారు మాట్లాడుతూ నారా లోకేష్ బాబు గారు ప్రజలకు చేస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. యువ గళం పాదయాత్రతో రాష్ట్రంలోని ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడు నారా లోకేష్ అని అన్నారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక పాలనతో అన్ని వర్గాలకు జరిగిన తీవ్ర నష్టాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం కల్పించిన నాయకుడు నారా లోకేష్ బాబుని ఆయన స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అందరూ సమిష్టిగా పనిచేసే వినుకొండ నియోజకవర్గంలో టిడిపి జెండాను అత్యధిక మెజార్టీతో ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో.తెలుగు యువత నాయకులు లగడపాటి శ్రీనివాసరావు,నలబోలు శ్రీను,చింతా గంగయ్య,వీరగంధం ఆనంద్, యూత్ జాని , మేడా అశోక్, మేదరమెట్ల అనీల్. కాసి,నర్రా కిశోరే,ప్రశాంత్,lic నాగి,పి.వి.సురేష్ బాబు ,గడిపుడి విశ్వనాధం,దుళ్ళ నాగార్జున , విద్యార్ధి నాయకులు ,ఐ.టిడిపి నాయకులు టిడిపి నాయకులు తెలుగు దేశం పార్టీ అభిమానులు కార్యక్రర్తలు పాల్గొన్నారు