రాజాంలోవై సి పి విస్తృత స్థాయి సమావేశం

రాజాంలోవై సి పి విస్తృత స్థాయి సమావేశం

జనం న్యూస్. జనవరి. 23. విజయనగరం జిల్లా. రాజాం.

రాజాం నియోజకవర్గం లో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో రాజాం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం ఎస్ ఆర్ కళ్యాణ మండపం నందు నిర్వహించారు. ఈ సమావేశానికి

ముఖ్య అతిథులుగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, పాలవలస విక్రాంత్,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్ మోహన్ రావు, పలాస అసెంబ్లీ నియోజకవర్గ పరశీలకులు పులిరాజు పాల్గొన్నారు. రాజాం 

నియోజకవర్గం ఇంచార్జ్ తలే రాజేష్ మాట్లాడుతూ రాష్టంలో

ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రివై.ఎస్.జగన్మోహరెడ్డి

నని అన్నారు. ఈ సదర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మాట్లాడుతూ ఈ నెల 27న భీమిలిలో జరగనున్న ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల శంఖరావాన్ని విజయవంతం చెయ్యాలని పిలుపు నిచ్చిరు. 2024లో మళ్ళీ వైస్ జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రి చెయ్యాలిని తెలిపారు. 2019 అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి నని అన్నారు.

రాష్ట్రంలో అన్ని వర్గాలవారికి అమ్మఒడి, విద్యా దీవెన, రైతు భరోసా, డ్వాక్రా రుణాలు, నాడు నేడు ద్వారా పాఠశాల భవనాలు పునర్వ్యవష్టికరణ చేసిన ఘనత 2024 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనిని అన్నారు.నూటికి నూరు శాతం ఇచ్చిన హామీలు నెరవేర్చారని

అన్నారు. ఈ సమావేశంలో నాలుగు మండలాలు ఎంపీపీలు, జెడ్పీటీసీలు,వైస్ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు,రాజాం టౌన్ పార్టీ అధ్యక్షులు, స్టేట్ డైరెక్టర్లు, మండల జె.సి.ఎస్ కన్వీనర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సోషల్ మీడియా కన్వీనర్లు,రాజాం టౌన్ పరిధిలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న వార్డ్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు...