శివనామస్మరణతో మారుమోగిన దేవాలయాలు

శివనామస్మరణతో మారుమోగిన దేవాలయాలు

కేశంపేట మండల కేంద్రంలో మరియు తదితర గ్రామాలలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు వేకువ జాము నుండి దేవాలయాల వద్ద బారులు తీరారు. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేశంపేట మండల కేంద్రంలో గల గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. యాదయ్య చారి దంపతులు, భాస్కరాచా రి దంపతులు వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం జరిపించారు. అనంతరం గ్రామంలో గోవిందమాంబ సమేతవీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.