ప్రారంభమైన బండలాగుడు పోటీలు

ప్రారంభమైన బండలాగుడు పోటీలు
ప్రారంభమైన బండలాగుడు పోటీలు

  కేశంపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ధవళగిరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి తో కలిసి బండలాగుడి పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంబరాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదవ్ ,జడ్పిటిసి సభ్యురాలు విశాల శ్రావణ్ రెడ్డి, కొత్తూరు మాజీ జెడ్పిటిసి సభ్యుడు మామిడి శ్యాంసుందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీశ్వర్, ఎంపీటీసీ సురేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి , కేశంపేట తాజా మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, యువజన సంఘాల నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.