అత్యధిక మెజార్టీతో నోముల భగత్ ను గెలిపిస్తాం

అత్యధిక మెజార్టీతో నోముల భగత్ ను గెలిపిస్తాం

బిఆర్ఎస్ ఉద్యమకారుడు కౌన్సిలర్ రమేష్ జి

 జనం న్యూస్ నాగార్జునసాగర్ ప్రతినిధి:  నవంబర్ 6 ఈ ఎన్నికల్లో నాగార్జునసాగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని నందికొండ మున్సిపాలిటీ ఐదవ వార్డ్ కౌన్సిలర్,హిరేఖర్ రమేష్ అన్నారు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి జరిగిందన్నారు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కెసిఆర్ దే అన్నారు ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీ సాధిస్తుందని తెలిపారు తాను ఉద్యమ కాలం నుండి బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా తన తుది శ్వాస వరకు బిఆర్ఎస్ పార్టీ గెలుపు కొరకు కృషి చేస్తానన్నారు