*బీజేపీ నేతలు పల్లెకు పోదాం :
మానేపల్లి అయ్యాజీ వేమ*
జనం న్యూస్ జనవరి 27 కా ట్రీ ని కోన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు శ్రీ యళ్ళ వెంకట రామ మోహన్ రావు(దొరబాబు) విజ్ఞప్తి మేరకు భారతీయ జనతా పార్టీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ ఛలో అభియాన్ కార్యక్రమం జిల్లా ఇంఛార్జి అధ్యక్షతన చెరుకూరి గోపాల్ కృష్ణ సమావేశం నిర్వహించారు .... ఈ సమావేశం ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనేపల్లీ ఆయ్యజీ వేమ మాట్లాడుతూ జిల్లా లో వున్న కన్వీనర్, కో కన్వీనర్ 28 మండల అధ్యక్షులు కన్వీనర్ , కో కన్వీనర్ నియమించాలని తెలియజేశారు . చలో అభియాన్ కార్యక్రమం సంబంధింత మండల కన్వీనర్ కో కన్వీనర్ పేర్లు నమోదుచేసి భారతీయ జనతా పార్టీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు యళ్ళ వెంకట రామ మోహన్ రావు (దొరబాబు) ఎర్ర వంతెన వద్ద వున్న రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం సమీపం లో వున్న కార్యాలయంలో సమర్పించగలరు. అలాగే 28 వ తేదీ అది వారం మధ్యాహ్నం 02 గంటల నుండి 06 గంటల వరకు ప్ర శిక్షణ కార్యక్రమం జిల్లా శాఖ కార్యాలయం లో నిర్వహిస్తారు ... కావున రాష్ట్ర జిల్లా మండలస్థాయి తో పాటు బూతు లెవెల్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్న వాళ్ళని వేమ పేర్కొన్నారు . ఈ కార్యక్రమం లో డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ మోకా వెంకట సుబ్బారావు, ఉపాధ్యక్షులు దూరి రాజేష్, ఛలో అభియాన్ జిల్లా కో కన్వీనర్ ఆకుల వీరబాబు , ఈత కోట బాల స్వామీ , శ్రీనివాస్ , అమలాపురం పట్టణ అధ్యక్షులు వెంపరల భాస్కర్ శాస్త్రీ తదితరులు పాల్గొన్నారు