భీమిలి సభను విజయవంతం చేయాలి ౼ ఎమ్మెల్యే శంబంగి

భీమిలి సభను విజయవంతం చేయాలి ౼ ఎమ్మెల్యే శంబంగి

జనం న్యూస్. బొబ్బిలి నియోజక వర్గం. తేది:23-01-2024.మంగళవారం.

ఈ నెల 27 వ తేదీన, విశాఖపట్నం భీమిలిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర వైసీపీ శ్రేణులతో నిర్వహించనున్న సమావేశాన్ని విజయవంతం చేయాలని 

 పిలుపునిచ్చారు.

మంగళవారం తెర్లాం మండల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు కార్యకర్తలుతో ఆయన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 175/175 నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని అందులో భాగంగానే ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం పురించనున్నారు.కావున బొబ్బిలి నియోజకవర్గం నుంచి వైసీపీ నాయకులు,కార్యకర్తలు, భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్సుపల్లి ఉమాలక్ష్మి, జడ్పీటీసీ గర్బాపు రామారావు,ఎఎంసి చైర్మన్ బొమ్మి శ్రీనివాసరావు,వైస్ ఎంపీపీ చెపేన సత్యనారాయణ,అప్పలరాజు, మండల పార్టీ అధ్యక్షుడు తెంటు సత్యం నాయుడు,మండల యువజన విభాగం అధ్యక్షుడు మదాసు శేషగిరి,వివిధ గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు, పాల్గొన్నారు.