రక్తదాన శిబిరం

రక్తదాన శిబిరం

కేశంపేట మండల మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో శ్రీ శ్రీ శ్రీ గురుబ్రహ్మ సతీష్ నాయర్ స్వామి జ్ఞాపకార్థంగా కేశంపేట మండల అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా పలువురు రక్తదానం చేశారు. కేశంపేట మండల కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విశ్వనాథ0 మాజీ సర్పంచ శ్రీధర్ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ చంద్రశేఖర్. లైన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.