లోకేష్ జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిలో రోగులకు రొట్టి పాలు పంపిణీ

లోకేష్ జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిలో రోగులకు రొట్టి పాలు పంపిణీ

జనం న్యూస్ జనవరి 23 (అనకాపల్లి జిల్లా)

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బుద్ద నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా ఏరియా ఎన్టీఆర్ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు రొట్టి పళ్ళు సుమారు 100 మందికి మరియు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అందరికీ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగ జగదీష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లోకేష్ జన్మదిన సందర్భంగా పేదలకు చీరలు దుప్పట్లు మరియు అన్నదానం కార్యక్రమాలు నెరవేర్చడం జరుగుతుందని ఈ సంవత్సరం పార్లమెంట్ కార్యాలయంలో 500 మంది పేదలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలా గోవింద సత్యనారాయణ జనసేన నాయకులు పరుచూరి భాస్కరరావు యువ నాయకులు దాడి రత్నాకర్ సమక్షంలో పార్లమెంట్ కార్యాలయంలో జరుగుతుందని నాగ జగదీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట్ని రామకృష్ణ ధనాల విష్ణు చౌదరి పొలిమేర నాయుడు దాడి అప్పారావు మల్ల గణేష్ విల్లూరి రమణబాబు కర్రి మల్లేశ్వరరావు కొమ్మర్తి నారాయణ శ్యామ్ సుందర్ అయ్యప్ప యలమంచిలి బంగారు రాజు బుద్ధ ఈశ్వరరావు పెంటకోట వరప్రసాద్ దితరులు పాల్గొన్నారు.//