*పౌర్ణమి రోజున సామూహిక హారతి జరుపుకోవాలి*

*పౌర్ణమి రోజున సామూహిక హారతి జరుపుకోవాలి*

అచ్యుతాపురం(జనం న్యూస్): మండలం లోని

హరిపాలెం-అందలాపల్లిలో శ్రీ భగీరధమ్మ ఆలయంలో ఎస్ఎస్ఎఫ్ మండల సమావేశం జరిగింది.

శరత్ పౌర్ణమి రోజున సామూహిక హారతి జరుపుకోవాలని, ఈనెల 9న మునగపాకలో గ్రామ కన్వీనర్ల ఒక్క రోజు శిక్షణా కార్యక్రమము జరుగుతుందని ప్రతీ గ్రామం నుండి పాల్గొనేలా ప్రయత్న చెయ్యాలని సమరసతా సేవా ఫౌండేషన్ యలమంచిలి ఖండ సంయోజకులు బివి రమణ అన్నారు.

ప్రతీ గ్రామములో వారం వారం భజన,ఏకాదశికి నగర సంకీర్తన రెండవ శని వారం సత్సంగం కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, ప్రతి గ్రామంలో దేవాలయం కేంద్రంగా వారం వారం భజన,ఏకాదశి నగర సంకీర్తన, ప్రతి పౌర్ణమికి సామూహిక హారతి, జరుగుతూ ఉండాలని , తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎలమంచిలి ఖండ ధర్మప్రచారకులు కొల్లి అప్పారావు,మండల సంయోజకులు గుడివాడ రమణ, సహ సంయోజకులు,చోడపల్లి సత్యం, ఆడారి త్రినాథ్, మహిళా కన్వీనర్ బీశెట్టి దేవి, జగ్గన్నపేట సర్పంచ్ దొడ్డి కృష్ణ, , బీశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.