అత్తను వేదిస్తున్న అల్లుడు.. పిర్యాదు చేసిందని తననే కట్టేసి గుండు గీసి చావకొట్టారు..

జనం న్యూస్: మహిళలపై లైంగిక వేధింపులు , దాడుల ఘటనలు దేశంలో నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ మహిళను లైంగికంగా వేధించడమే కాకుండా ఆమెపై దాడి చేసి గుండు కొట్టిన మరో అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని కన్నౌజ్‌లో నివసిస్తున్న ఓ మహిళ మేనల్లుడు రాజనాథ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అతడి కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె చెబుతోంది నిజమో, అబద్ధమో కూడా పట్టించుకోకుండా రాజనాథ్ కుటుంబసభ్యులు, ఆమెని దుర్భాషలాడి దాడికి దిగారు. విపరీతంగా కొట్టి చేతులు, కాళ్లు కట్టేసి శిరోముండనం చేశారు. నిందితుల అరాచకం ఇక్కడితో ఆగలేదు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియా లో కూడా పోస్ట్ చేశారు. కాగా.. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసుల వరకు చేరింది. దీంతో కేసు నమోదు చేసి ఆరుగులు నిందితులను అరెస్ట్ చేశామని కనౌజ్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కుమార్ ఆనంద్ తెలిపారు. ఈ ఘటన సెప్టెంబర్ 3న జరిగిందని, దాడి చేసిన వారిలో బాధితురాలి భర్త కూడా ఉన్నాడని ఆయన తెలిపారు.