ప్రత్యేక ఆకర్షణగా ఆల్‌ ఇండియా మెగా డ్వాక్రా బజార్‌

ప్రత్యేక ఆకర్షణగా ఆల్‌ ఇండియా మెగా డ్వాక్రా బజార్‌

జనం న్యూస్ 03 నవంబర్

విజయనగరం టౌన్ రిపోర్టర్

గోపికృష్ణ పట్నాయక్

విజయనగరం ఉత్సవాలు, పైడితల్లమ్మ పండగ సందర్భంగా ఆల్‌ ఇండియా మెగా డ్వాక్రా బజార్‌ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

దేశంలోని అన్నిరాష్ట్రాల డ్వాక్రా మహిళలు, చేతివృత్తిదారులు తయారు చేసిన వస్తువులు, కళారూపాల ఉత్పత్తులను ఈ డ్వాక్రా బజార్లో ప్రదర్శించనున్నారు. ఇది 10వ తేదీన ప్రారంభం అవుతుంది. 20వ తేదీతో ముగుస్తుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను డీఆర్టీఏ పీడీ.కళ్యాణ్‌ చక్రవర్తి చూస్తున్నారు.